Header Banner

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! థాయిలాండ్ లో అత్యవసర ల్యాండింగ్..

  Fri Jun 13, 2025 13:41        India

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈరోజు ఉదయం తీవ్ర కలకలం రేగింది. విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పైలట్, విమానాన్ని వెనక్కి మళ్లించి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏరోనాటికల్ రేడియో ఆఫ్ థాయ్‌లాండ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 379 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్‌కు బాంబు బెదిరింపు గురించి సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే ఫుకెట్‌కు తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరారు. ఫుకెట్ విమానాశ్రయ అధికారులు తక్షణమే స్పందించి, ఎయిర్‌పోర్ట్ కంటింజెన్సీ ప్లాన్‌ను అమలులోకి తెచ్చారు. బాంబు బెదిరింపుల సమయంలో అనుసరించాల్సిన నిర్దేశిత అత్యవసర నిబంధనల ప్రకారం ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేసి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

 

ఇది కూడా చదవండి: కర్ణాటకలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు ఏపీ వాసులు దుర్మరణం!

 

ప్రాథమిక సోదాల్లో ఎలాంటి బాంబు లభ్యం కాలేదని తాజా సమాచారం ద్వారా తెలిసింది. అయితే, విమానంలో ఒక బాంబు బెదిరింపు నోటు దొరికిందని అధికారులు ధ్రువీకరించారు. ఆ నోటును ఎవరు రాశారు, దానిని ఎవరు గుర్తించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నోటును కనుగొన్న ప్రయాణికుడిని అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా భారతీయ విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతేడాది తొలి పది నెలల్లోనే దాదాపు 1,000 వరకు ఇలాంటి తప్పుడు కాల్స్, సందేశాలు అందాయని, ఇది 2023లో నమోదైన సంఖ్య కంటే దాదాపు పది రెట్లు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన మరోసారి ఆందోళన కలిగించింది. రవాణా మంత్రిత్వ శాఖ మరియు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అన్ని అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వారు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Air India #Emergency Landing #Thailand #Bomb Threat